కిషోర బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

ప్రజాశక్తి – ఉండ్రాజవరం:  కిషోర బాలికల వికాస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని గ్రామ, గ్రామాన వేసవి కాలంలో బాలికలు సెలవులను  సద్వినియోగం చేసుకునే విధానం, తదితర జాగ్రత్తల పై పలువురు వక్తలు, పలు సూచనలు అందించారు. కౌమార దశలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సలహాలను  వీడియోల ద్వారా వివరించారు. పునరుత్పత్తి, బాల్య వివాహాల వలన సంభవించే  నష్టాలు, బాల్య వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం విధించే శిక్షల గురించి విశదీకరించారు. ఆడపిల్లలను 18 సంవత్సరాల వరకు చదివించాలని, అనంతరమే వివాహం జరిపించాలని బాలికల తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడిపర్రు లోహొ సిడిపిఓ శ్రీలక్ష్మి, చిలకపాడు లో పంచాయతీ కార్యదర్శి చోళ్ల రాజు, ఆయా గ్రామాలలో అంగన్వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎం లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు.

➡️