హెచ్‌ఎల్సి కాలువ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : హెచ్‌ఎల్సి ఏఈ శ్రీనివాసులు

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : హెచ్‌ ఎల్‌ సి కెనాల్‌ కు సంబంధించిన స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్‌ఎల్సి ఏఈ శ్రీనివాసులు అన్నారు సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సాగునీటి సంఘం అధ్యక్షుడు పరంధామాతో కలిసి పాత్రికేయులతో మాట్లాడిన ఎఈ హెచ్‌ఎల్సి కెనాల్‌ కు సంబంధించిన స్థలాలను కొందరు వ్యక్తులు కొన్నిచోట్ల ఆక్రమించుకోవడం జరిగిందని వాటిని పరిశీలించి ఆక్రమించుకున్న స్థలాలను ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు కూడా తెలపడం జరిగింది అని ఒకటి రెండు చోట్ల జరిగిన ఆక్రమణలను చూపించి చాలామంది రైతులు తాము కూడ హెచ్‌ఎల్సి స్థలాలను ఆక్రమించుకుంటామంటున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఎవరైనా కాలువకు సంబందించిన స్థలాలను ఆక్రమించుకొని ఉంటే అటువంటి వాటిని స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు మండలంలో ఎక్కడైనా కాలువకు సంబంధించిన స్థలాలు ఆక్రమణ గురైఉంటే తమ దఅష్టికి తీసుకురావాలని తెలిపారు..

➡️