ప్రజాశక్తి-విజయనగరంకోట : గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చిన హెల్త్ ప్రొవైడర్లగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మికి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరి రామయ్య పంతులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం అశోక్బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్భార్లో ఆయన తమ సమస్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 వేల మంది గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చే విధంగా గతంలో ఏర్పాటు చేసిన 465 జీవోను పునరుద్ధరణ చేసి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వినతినిచ్చిన వారిలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అప్పలరాజు ఉన్నారు.
