ప్రజాశక్తి-మార్కాపురం : రాష్ట్రంలో కూటమి సర్కార్ తప్పులను ఎత్తిచూపుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై అక్రమ కేసులతో పాటు ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఓ విధంగా బెదిరింపు చర్యలేనని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజ రురెడ్డిపై అక్రమ కేసులతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించడాన్ని ఎపియుడబ్ల్యుజె ఖండించింది. ఆ సంఘం ఆధ్వర్యంలో మార్కాపురంలో పలువురు జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన గురువారం చేపట్టారు. అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాగ్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమానికి సాక్షి మార్కాపురం ఇన్చార్జి జిఎల్ నరసింహారావు నాయకత్వం వహించారు. కంభం రూరల్: సాక్షి ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడి, దురుసు ప్రవర్తన కంభంలో పలువురు విలేకరులు నిరసించారు. ఈ మేరకు కంభం సిఐ కె మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు కారకులయిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంభం, బి పేట, అర్ధవీడు, రాచర్ల మండల విలేకరులు పాల్గొన్నారు.
