ప్రజాశక్తి పులివెందుల టౌన్ ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి, తైవాన్ రకాల రాకతో తోటలను సంతరించుకుంది. దీనిసాగు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం 70వేల ఎకరాలకు పైగా ఉంది. ఒకప్పుడు ఇంటి పెరట్లోనో, పొలం గట్లపైనో ఉన్న బొప్పాయికి ఇంతగా ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలే అని చెప్పక తప్పదు. దీనికితోడు రిటైల్ మార్కెట్లు, సూపర్ మార్కెట్ల రాకతో దీనిసాగు వాణిజ్యరూపును సంతరించుకుంది. ప్రస్తుతం బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు, ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలుచేసే వివిధ ఔషధ గుణాలు మెండుగా ఉండడం వల్ల బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దీని వాడకం విస్తతమవటం, మార్కెట్ డిమాండ్ పెరగటంతో రైతుకు బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది. సాధారణ బొప్పాయి రకాలకంటే, తైవాన్, సంకర రకాలు 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడినిస్తుండటంతో బొప్పాయిసాగు మరింతగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా ఉండటం, పెనుగాలుల తాకిడిని తట్టుకునే స్వభావం ఉండటంతో రైతులకు సాగులో సమస్యలు చాలా వరకు తగ్గుతాయని రైతులంటున్నారు. సాధారణంగా బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై, మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది. ముఖ్యంగా బొప్పాయి కోతలు అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్లదూరం పైన ఆధారపడి వుంటుంది. లోకల్ మార్కట్లకే కాక ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన మార్కెట్లను దష్టిలో ఉంచుకుని, అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు కొందరు రైతులు. పంపే మార్కెట్ ఏదయినా కోతల సమయంలో కొన్ని మెలకువలు తప్పనిసరి. సాధారణంగా, వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలని, పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయ కూడదని రైతులు చెబుతున్నారు. ఈపంట సాగులో దిగుబడులు ఆశాజ నకంగానే ఉన్నా, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తెగుళ్ళు. వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలతో అరికడుతూ, ఎకరానికి 100 టన్నుల దిగుబడులు సాధించిన రైతులూ ఉన్నారు. బొప్పాయిని సాగు చేయటం పైనే కాదు, కోతల అనంతరం కూడా సరైన మెలకువలు పాటించినప్పుడే మంచి రాబడి వస్తుందని రైతులంటున్నారు.మార్కెట్ పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు, కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే, కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటపుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత వాటినుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. లేదంటే కాయలపై మచ్చలుగా ఏర్పడి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా పూర్తిగా ఆరిన కాయలను ప్యాకింగ్ చేసుకోవాలి.- చెన్న కృష్ణారెడ్డి, రైతు లింగాలఅనుకూలమైన రకాలతో మంచి దిగుబడి రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. ఒక ఎకరాకు 1000 మొక్కలు నాటాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫో బాక్టీ రియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలు పుకొని వేసు కోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి.- మహేశ్వర్ రెడ్డి , రైతు పులివెందులయాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకతి సాగు చేయడం వల్ల కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.12 నుంచి 15 వేలు ధర పలుకుతుంది.- జనార్దన్ రెడ్డి, రైతు పులివెందులబూడిద తెగుళ్లు నివారిస్తే మంచి దిగుబడి బొప్పాయి పంటకి ఎక్కువగా ఆకు మీద నల్లని మచ్చ కలిగిన బూడిద తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి తడి సల్ఫర్, సల్ఫర్ డస్ట్, లేదా లైం సల్ఫర్, పొటాషియం బైకార్బోనేట్ వంటివి వ్యాధిని నియంత్రించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. కానీ అధిక వేడి వాతావరణంలో వీటిని వాడటం వల్ల మొక్కలపై విషపూరిత ప్రభావం చూపిస్తుంది. కొన్ని పరిస్థితులలో బేకింగ్ సోడా, వేప నూనె, సబ్బు ద్రవాలు కూడా వాడవచ్చు. వ్యాధి తీవ్రత అధికంగా చూసుకుంటే మంచిది.- ఉద్యానవనాధికారి రాఘవేంద్ర రెడ్డి
