టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భూమి పూజ

Mar 14,2025 16:36 #Kurnool, #T.G Bharat

ప్రజాశక్తి – పత్తికొండ : పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ మజారా కన్నికదిన్నె గ్రామం వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి, టీజీ భరత్, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ శ్యామ్ కుమార్, ఎంపీ బస్తి పాటి నాగరాజు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డా.గెడ్డం శేఖర్ బాబు, పీడీ ఉమాదేవి, ఆర్డీవో భరత్ నాయక్, ఎమ్మార్వో రమేష్ వాల్మీకి కార్పొరేషన్ డైరక్టర్ బొజ్జమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్క రెడ్డి, బత్తిన వెంకట్రాముడు, సాంబశివరెడ్డి తుగ్గలి నాగేంద్ర తదితరుల పాల్గొన్నారు.

➡️