ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 17,18 తేదీ లలో ఆదుర్రు బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ప్రాచీన భారతీయ వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాల కరపత్రిక ను బుద్ధ విహార్ ట్రస్ట్ మంగళవారం ఆదుర్రులో ఆవిష్కరించారు ఈనెల 17న థాయిలాండ్ మినిస్ట్రీస్ సమర్పించిన బుద్ధుని కాంస్య విగ్రహం ప్రతిష్ట, బుద్ధ విహార్ నిర్వాహకులు ఎస్ ఎస్ ఆర్ భూపతి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్మించిన అతిథి గృహము ఆవిష్కరిస్తారన్నారు 18న దమ్మ సందేశాలు, దమ్మగీతాల ఆలాపన ఉంటుందన్నారు ఆదుర్రు బౌద్ధ స్తూపం నందు బుద్ద విహార ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ఎస్ఆర్ భూపతి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలోసభ్యులు మట్ట వెంకట్రావు,పెనుమాల సుధీర్, తాడి సురేష్,బల్ల శ్రీనివాసరావు, రావి విజయ్,మాగాపు ఈశ్వరరావు, గిడ్ల మల్లేశ్వర రావు, కొట్టాల నరసింహమూర్తి, పెట్టా శ్రీనివాసరావు, పెదసింగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
