అనాథ వృద్ధుల కొరకు వసతి గృహం నిర్మాణం

May 8,2025 13:26 #Kadapa district

ప్రజాశక్తి – ప్రోద్దుటూరు : ప్రోద్దుటూరు పట్టణంలోని ఈశ్వరరెడ్డి నగర్ లో ఉన్న అమ్మ, నాన్న మదర్ థెరిస్సా షబ్బీర్ అనాథ వృద్దాశ్రమంలో వృద్ధుల కొరకు దాత రిటైర్డ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎండి రామకృష్ణ, శ్రీదేవి ఆధ్వర్యంలో వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. అలాగే వసతి గృహాంలో యుఎస్ఏ కు చెందిన సిద్దారాంపురం రామ్ కిషోర్, శైలజాలు ప్లోరింగ్ పనులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం నూతనంగా నిర్మించిన వసత గృహన్ని రిటైర్డ్ ఎస్ఐ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల కొరకు వసతి గృహన్ని ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జీవితంలో పిల్లల ప్రేమాభిమానాలు లేని అనాథలకు సేవా చేయాలనే తపనతో తనకు తోచిన సహయం చేస్తున్నట్లు చెప్పారు. అనాథ వృద్ధులకు, వికలాంగులకు సేవా చేయడం అనేది గొప్ప భాగ్యం అన్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ రామకృష్ణ కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

➡️