ప్రజాశక్తి – కడప
జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, వారి సమస్యలను సంతప్తిచెందేలా వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ జి. గణేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జెసితోపాటు డిఆర్ఒ గంగాధర్గౌడ్, డిఆర్డిఎ పీడీ ఆనంద్ నాయక్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఎ రీఓపెనింగ్ అర్జీలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
