పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమని ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఇన్ఛార్జి సిఇఒ శ్రీనివాస ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. మరో వైపు గ్రామీణ పేదల వలసలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బద్వేల్, గోపవరం, పోరుమామిళ్ల, మైదుకూరు పట్టణాలలో ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉన్నవారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కలెక్టరేట్ సోమవారం నిరసనలతో హోరెత్తింది.కార్మికుల తొలగింపు అన్యాయం – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ప్రజాశక్తి – కడప అర్బన్ పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమని ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటసుబ్బయ్య, సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్మికుల తొలగింపునకు నిరసనగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను తొలగించడం వెనుక సిఇఒ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాల ప్రిన్సిపల్గా శ్రీనివాస ప్రసాద్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఇన్ఛార్జిగా సిఇఒగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న 25 మంది కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూనే వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండి ‘మీరు విశ్వం ఏజెన్సీకి’ వెళ్లాలని కార్మికులను గత నెల నుంచి భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్లో ఆఫీస్ సబార్డినేట్గా విధులు చేయాలని ఆప్కాస్ వారు తమకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారని, అలా కాకుండా తమతో సెక్యూరిటీగా విధులు చేయిస్తున్నారని తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్స్గా కొనసాగించాలని ఇన్ఛార్జి సిఇఒను కోరగా ‘మీరు ఆప్కాస్కు అవసరం లేదు, ఇంటికి వెళ్లండి అనే పద్ధతిలో మాట్లాడడం సమంజసం కాదని చెప్పారు. విశ్వం ఏజెన్సీ వారితో రహస్య ఒప్పందం చేసుకుని కొంతమందిని సెక్యూరిటీగా నియమించుకుని 25 మందిని విధులకు హాజరుకానికుండా ఆటంకం కలిగిస్తున్న ఇన్ఛార్జి సిఇఒను సస్పెండ్ చేయాలని, అలాగే పులివెందల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆప్కాస్ ఉద్యోగస్తుడు లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని, ఆయన కూడా 25 మంది కార్మికులను నానా విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ విధులకు హాజరు కాకుండా ఆటంకం కలుగజేస్తున్నారని వీరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఆప్కాస్ను కొనసాగించాలని వద్ద అనే నిర్ణయం ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదని, కానీ పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇన్ఛార్జి సిఇఒ మాత్రం అతి ఉత్సాహంతో 25 మంది కార్మికులను విధులకు హాజరు కాకుండా ఆటంకం కలిగించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది అర్థం కాని విషయం అన్నారు. ఇన్ఛార్జులుగా ఉన్న వ్యక్తులు కొత్తవారిని విధుల్లోకి చేర్చుకోవడం కానీ తొలగించడం కానీ చేయడం ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ లేదని పేర్కొన్నారు.తక్షణమే ఇన్ఛార్జి సిఇఒ శ్రీనివాస ప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రామ్మోహన్, కమిటీ సభ్యులు మహేష్, జిల్లా కమిటీ సభ్యులు గోపి, ఆప్కాస్ యూనియన్ నాయకులు పవన్, ఉదరు, ఇతర నాయకులు పాల్గొన్నారు.పేదలకు భూ పంపిణీ చేయాలి కలెక్టరేట్ వద్ద ధర్నాలో వ్య.కా.స. నాయకుల డిమాండ్ ప్రజాశక్తి – కడప అర్బన్ గ్రామీణ పేదల వలసలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి. అన్వేష్, ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వ్య.కా.స. ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పేదలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం విభజన ఏర్పడి 11 ఏళ్లు అయిందని తెలిపారు. అప్పటి నుంచి పరిపాలించిన టిడిపి, వైసిపి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలకు భూ పంపిణీ అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసిపి, టిడిపి, బిజెపి రాజకీయ పలుకుబడి కలిగిన వారు, ధనవంతులు, ఇతర జిల్లాలకు చెందిన వారు పెద్ద ఎత్తున జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని దొంగ పట్టాలు, పాసు పుస్తకాలు ఆన్లైన్ బినామీ పేర్లతో లక్ష ఎకరాలు అనుభవిస్తున్నారన్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవటంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం, స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహి స్తున్నారని విమర్శించారు. ఒక ఎకరం భూమి రద్దు చేయలేదని తెలిపారు. విద్యుత్ అధికారులు ప్రభుత్వ భూములలో పట్టాలు ఉన్నాయా లేవా చూడకుండా ఎక్కడపడితే అక్కడ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున అమరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ భూముల్లో విద్యుత్ కనెక్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బద్వేల్, గోపవరం, పోరుమామిళ్ల, మైదుకూరు పట్టణాలలో ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉన్నవారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం పనిచేసిన కూలీలు అందరికీ 12 వారాల నుంచి డబ్బులు చెల్లిం చకుండా బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుందని వాపోయారు. చట్టంలో ప్రతి శనివారం డబ్బులు చెల్లిం చాలని ఉన్నా, 15 రోజులు ఇవ్వకపోతే వడ్డీతో సహా చెల్లించాలని చట్టం లో ఉన్నా ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వల్లూరు, సింహాద్రిపురం, అట్లూరు మండలాలలో ఈ నెలలో ఉపాధి పనులు చేస్తూ పని ప్రదేశంలో కూలీలు చనిపోతే రూ.50 వేలు నష్టపరిహారం ఇస్తామని అన్నారని, అది దహన క్రియల కే సరిపడుతుందన్నారు. ఆ కుటుం బాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమ్మర్ అలవెన్సులు పనిముట్లకు, మజ్జిగ నీళ్లకు అన్నిటికీ కోత విధిం చిందన్నారు. వలసలు నివారించాలంటే ఉపాధి హామీలో ఏడాదికి 200 రోజులు పనులు, నేటి ధరలకు అనుగుణంగా రూ.600 వేతనం చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాకు ముందుగా మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్య కమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరయ్య, నరస య్య, సురేష్ బాబు, అట్లూరు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, బద్వేల్ రూరల్, గోపవరం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
