జిల్లాలో ఎన్పిపిపి ఫ్లయాష్ వ్యవహారంపై అనవసర వివాదం నడుస్తోంది. తాజాగా స్థానిక ప్రజాప్రతినిధి ఫ్లయాష్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకునే ఉద్దేశంతో అల్ట్రాటెక్ కంపెనీలోకి వెళ్తున్న వాహనాల నిలుపుదల దగ్గర నుంచి అల్ట్రాటెక్లో తనిఖీలు వగైరా స్వార్థపూరిత చర్యలతో ముందుకెళ్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. కంపెనీ యాజమాన్యంతో కలిసి కూర్చుకుని పరిష్కరించుకోవాల్సిన ఫ్లయాష్ సరఫరా కాంట్రాక్టు వ్యవహారాన్ని బహిరం గపరచుకుని పలచన కావడాన్ని ఏమనుకోవాలో తెలియడం లేదు. ఇటువంటి ఘర్షణాత్మక ధోరణుల కారణంగా జిల్లా పారిశ్రామిక వాతావరణం కలుషిత మవుతోంది. ఫలితంగా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రా మికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు 2014-19 పీరియడ్లో కడప నగర పరిధిలోని అలంఖాన్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లా డుతూ రౌడీయుజం కారణంగా పరిశ్ర మలు రావడం లేదని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. స్ఫహ కలిగిన ముఖ్యవ ుంత్రి చంద్రబాబు హయాంలోనే వరుసగా దాడులు, దౌర్జన్యాలు కొనసాగ డానికి ఎవరు బాధ్యులో ఆయనకే తెలియాలి. ఇప్పటికైనా జిల్లా కూటమి నాయకత్వం జిల్లా అభివృద్ధికి అటంకాలు కలిగించకుండా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాల్సి ఉంది. లేనిపక్షంలో చరిత్రలో అసమర్థ నాయకులుగా నిలిచి పోవడం ఖాయ మని గ్రహించాలి. కూటమి సర్కారు బుగ్గవంక సుందరీకరణపై కదలడం శుభసూచకం. జిల్లా ఇరిగేషన్ డిపార్టుమెంట్ రూ.2.5 కోట్లతో 15 ప్యాకే జీలుగా విభజించి బుగ్గవంక సుందరీకరణ పనుల టెండర్లను పిలిచింది. వీటిని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు ఏకపక్షంగా కట్టబెట్టడంపై వైసిపి ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. బుగ్గవంకలో కంపచెట్ల తొలగింపు కాంట్రాక్టు పనుల టెండర్ను తెరవడం పై ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదేతరహాలో జిల్లాలో తాగునీటి సరఫరా స్కీముల టెండర్లు తెరవడంపై ఆందో ళన నెలకొంది. అధికార పార్టీకి చెందిన టిడిపి నాయకత్వం ప్రత్యర్థి పార్టీ నా యకుని అనుచరునికి లక్కిరెడ్డిపల్లి సిపిడబ్య్లు స్కీమ్ కట్టబెట్టే ప్రయ త్నాలపై చర్చనీయాంశంగా మారింది. లెస్ వేసి కాంట్రాక్టర్ను ఎలా డిస్క్వాలిఫై చేయాలనే అంశంపై మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సదరు లెస్ వేసిన బిసి సామాజికవర్గ కాంట్రాక్టర్తో రాయచోటికి చెందిన రాజకీయ నాయకత్వం సంప్ర దింపులు చేయడం, ఒప్పుకోని పక్షంలో బలవంతంగానే జమ్మ లమడుగుకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్కు కట్టబె ట్టాలనే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తోంది. టిడిపి బిసిలకు సముచిత ప్రాధా న్యతనిస్తే రాజకీయాలు ఎందుకో పాలకులకే తెలియాల్సి ఉంది. ఇటువంటి ధోరణులు కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన రాజకీయ నాయ కత్వం అనుచిత పద్ధతుల్లో కాంట్రాక్టు పనులపై వ్యవహరించడం జుగుప్సను కలిగిస్తోంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి
