ప్రజాశక్తి – కాకినాడ
ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి అవగాహన సదస్సు నిర్వహి స్తున్నట్లు యుటిఎఫ్ నాయకత్వం వెల్లడించింది. శుక్రవారం స్థానిక యుటిఎఫ్ హోంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.రవి చక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ విలేకరుల సమావేశంలో మాట్లా డారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలను నిర్ధేశించుకున్న యుటిఎఫ్ ఉపాధ్యాయుల శ్రేయస్సు, ప్రభుత్వ విద్యా రంగం పరిరక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అలాగే సామాజిక సేవా, సహాయ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. దీనిలోభాగంగానే డిఎస్సికి సిద్ధపడుతున్న అభ్యర్థులకు ఈనెల 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని సూర్యకళామందిరంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు లో పోటీ పరీక్షల శిక్షణా నిపుణులు, పూర్వ ఎంఎల్సి కెఎస్.లక్ష్మణరావు, ఆయన బృందం హాజరై వివిధ అంశాలను బోధిస్తారని తెలిపారు. అదేవిధంగా సదస్సుకి హాజరైన అభ్యర్థులకు లక్ష్మణరావు సౌజన్యం తో రూపొందించిన విద్యా మనో విజ్ఞాన శాస్త్రం స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందచేస్తామన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ బుక్ను వారు ఆవిష్కరించారు. ఇతర వివరాలకు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు టి.రామలక్ష్మి (9959562666), కె.పెద్దిరాజు(9652677889)లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవివి.నగేష్, నాయకులు కె.ఈశ్వరరావు, కాంట్రాక్టు లెక్చరర్ల సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మాణిక్యం పాల్గొన్నారు.