ప్రజాశక్తి – యంత్రాంగం
కాజులూరు మండలంలోని శీలలంక, మంజేరు, శీల, చేదువాడ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీలను ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం శ్రమజీవులను అణగదొక్కే కొత్త కొత్త చట్టాల ను తీసుకొస్తూ కార్మికులపై పని భారం పెంచు తుందన్నారు. కార్మిక హక్కులను హరించేలా 4 లేబర్ కోడ్స్ను తీసుకొస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో బుడితి ప్రభాకర్రావు, ఇసుకపట్ల సుబ్రహ్మణ్యం, మాక రామారావు, నందిక ఇమ్మానుయేలు, పువ్వల భైరవమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఈ నెల 20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా కాకినాడ రైల్వే శాఖ ఎస్ఎస్ఇ రవికృష్ణకు రైల్వే కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నర్సింహులు, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ సమ్మె నోటీసు అందించారు. ఈ నెల 20న జరుగుతున్న సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు పాల్గొనేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా స్వచ్ఛందంగా వచ్చి సమ్మె ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గొల్లప్రోలు కార్మికుల అందరికీ కనీస వేతనం ఇవ్వాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్స్ అందరినీ కార్మికులుగా గుర్తించాలని కోరుతూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కంచపు సత్తిరాజు, కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పంచాయితీ వర్కర్స్, ఉపాధి హామీ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగ, కార్మికులు, రైతులు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఓరిగంటి నందీశ్వరుడు, అంగన్వాడీ యూనియన్ నాయకులు తులసి, ఆకుల రమాబారు, లక్ష్మి, ఆశ యూనియన్ నాయకులు వడ్డీ వెంకటలక్ష్మి, ఉమాదేవి, సత్యవతి, ఇందిరాదుర్గ, పాల్గొన్నారు.