ప్రేమ పేరుతో మోసం..యువతి ఆత్మహత్య

May 9,2025 22:48
ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రజాశక్తి – గండేపల్లి, పెద్దాపురం

మండలంలోని ఒక ప్రయివేటు కళాశాల వసతి గృహాంలో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న రౌతులపూడి మండలం మెరక చామవరంకు చెందిన నిండుకుండల నాగవల్లిక గురువారం అర్థరాత్రి సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ శివనాగు సిబ్బందితో సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి ఆమె మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ మాట్లాడుతూ వార్డెన్‌ నాగవల్లిక, అదే గ్రామానికి చెందిన శెట్టిబత్తుల శివదుర్గ ప్రేమించుకున్నారు. అయితే వివాహం చేసుకోవడానికి శివదుర్గ నిరాకరించడంతో మనస్థాపానికి గురియైన ఆమె ఉంటున్న రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె తల్లి నిండికొండల దేవుడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆసుపత్రి వద్ద రాస్తారోకో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రహదారిపై వార్డెన్‌ నాగవల్లిక కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. రాత్రి ఫోన్‌లో వీడియో కాల్‌ చేసి తమతో మాట్లాడిందని, ఉదయానికి ఆమె మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగమల్లిక మతిపై విచారణ జరిపి ఆమె మతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

➡️