చదువుతోపాటు, క్రీడలకు దోహదం

May 9,2025 22:49
క్యాంపు శుక్రవారంతో ముగిసింది.

ప్రజాశక్తి – తుని

గత 15 రోజులుగా శ్రీ ప్రకాష్‌లో విద్యార్థులకు జరుగుతున్న సమ్మర్‌ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. ఈ సమ్మర్‌ క్యాంపులో యోగా, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, ఆర్ట్‌ క్రాఫ్ట్‌, సంగీతం, స్కేటింగ్‌, కంప్యూటర్‌ బేసిక్స్‌, బాస్కెట్‌ బాల్‌, హ్యాండ్‌ బాల్‌, ఖో-ఖో, వాలీ బాల్‌, క్రికెట్‌, కబడ్డీ, స్కేటింగ్‌ తదితర అంశాలపై నిష్ణాతులైన కోచ్‌ లతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ముగింపు సభలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజరుప్రకాష్‌ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రతీ ఏడాది సమ్మర్‌ క్యాంపును నిర్వహించి విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు ఆసక్తిని పెంచుతున్నట్లు తెలిపారు. క్రీడలకు తమ విద్యా సంస్థ ఎల్లప్పుడూ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోజూ ఒక గంట సమయాన్ని వ్యాయాయం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యతో పాటుగా ఆటలకు తమ విద్యా సంస్థలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారానే తమ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయాలను సొంతం చేసుకుంటున్నారని అన్నారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందచేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఎంవివిఎస్‌.మూర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️