ప్రజాశక్తి – తాళ్లరేవు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ భానుమతి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జల్లావారిపేటలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. యువజన నాయకులు షణ్ముఖరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజేలు పెట్టి ర్యాలీలు చేయడం వరకే పరిమితం కాకూడదన్నారు. ఆయన జీవితం, ఆయన రాసిన భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవడం ద్వారా ఆయన ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, మానవ హక్కుల సంఘం నాయకులు పెయ్యల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదృష్టదీపుడు, పూలే అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి గుత్తుల మల్లేశ్వరరావు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కన్నీడి వెంకటరమణ మాట్లాడారు.