ప్రజాశక్తి – కాకినాడ
జిల్లాలో 24,769 మంది ఆర్హులైన లబ్దిదారుల ఖాతాలకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున రూ.49.54 కోట్లను సముద్ర వేట నిషేదకాల భతిని నేరుగా జమ చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకూ రెండు నెలల సముద్ర వేట నిషేధకాలానికి మత్సకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల చొప్పున అందిస్తున్న జీవన భృతి పంపిణీ కార్యక్రమాన్ని నిర్విహించారు. ఈ కార్య క్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎంఎల్సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్ఎ వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్దిదారులకు మెగా చెక్కును అందజేశారు. సముద్ర వేట నిషేధ రెండు నెలల కాలంలో జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రూ.20 వేలు చొప్పున మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి వి.కృష్ణారావు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.