గ్రాసానికి గడ్డు కాలం

May 8,2025 22:15
విపరీతంగా పెరిగిపోయింది.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

వరి సాగులో యాంత్రీకరణ విపరీతంగా పెరిగిపోయింది. యంత్రాలు లేనిదే రైతులు ఏ పని చేయని పరిస్థితి ఏర్పడుతున్న కారణంగా ఎండు గడ్డికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. దీంతో పాడి రైతులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదే తరుణంలో గ్రాసం పూర్తిస్థాయిలో లేక పశువులు అల్లాడుతున్న దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పశు సంపద క్రమంగా తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 80 శాతం మందికి పైగా ప్రజలు ప్యాకెట్‌ పాలు కొనుగోలు చేసుకుంటున్నారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పశుపోషణ తగ్గిందని గణాంకాలు తెలుపుతున్నాయి. పశు సంవర్ధక శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లాలో 76, 502 ఆవులు, 2,82,273 గేదెలు, 1,01,870 గొర్రెలు, 1,41,229 మేకలు ఉన్నాయి.రోజుకి 2 వేల మెట్రిక్‌ టన్నులుజిల్లాలో ఉన్న ఆవులు, గేదెలు వంటి పశు సంపదకు రోజుకి దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల ఎండుగడ్డి అవసరం ఉంటుందని పశు సంవర్దక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగిన గ్రాసం అందుబాటులో లేక పశువులు విలవిలాడుతున్నాయి. పాడి రైతులు కూడా పశు పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రాసం కొరత లేకుండా గతంలో సర్కారు పథకాలు విరివిగా అందేవి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. దీనిని అధిగమించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడం లేదు. ఫలితంగా పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.యంత్రాలతో కోతలుయంత్రాలతో మాసూళ్లు వల్ల నాణ్యమైన ఎండు గడ్డి లభించక రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తరచూ వాతావ రణంలో వస్తున్న మార్పులు వలన రైతులు యంత్రాలను ఆశ్రయించక తప్పడం లేదు. మరోవైపు పంట పొలాలను రొయ్యల, చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ కారణంగా కూడా పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు ఎండా కాలం వచ్చిదంటే పచ్చి గడ్డి మచ్చుకైనా కనిపించదు. వేసవిలో పశుపోషణ అంతా ఎండుగడ్డిపైనే ఆధార పడుతుంది. సార్వా సీజన్‌ లో గడ్డి తడిసిపోవడంతో పశువుల గ్రాసానికి పెద్దగా వినియోగించడం లేదు. పాడి పశువులకు గ్రాసం కోసం రైతులు ఎక్కువగా రబీ సీజన్లో వచ్చే గడ్డినే ఎక్కువగా వినియోగి స్తుంటారు. గతంలో ఎండు వరి గడ్డికి లోటు ఉండేది కాదు. కొన్నేళ్లుగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎండు గడ్డి కొరత తీవ్రంగా ఏర్పడింది. దీనితో మూగజీవాలకు పస్తులు తప్పడం లేదు. .రూ.12 వేలు పైనేకేవలం కూలీలతో కోసిన గడ్డికి మాత్రమే పశువుల పని చేయడంతో అది అతి తక్కువగా అందుబాటులో ఉండడంతో గడ్డి ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్‌ ఎండు గడ్డి ధర రూ.12 నుంచి రూ.14 వేల పలుకుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు నేరుగా పంట పొలాల్లోనే గడ్డిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా గడ్డికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. రైతుల పంట గట్టుకు రావడానికి కోత యంత్రా నికి, ట్రాక్టర్తో కలిపి దాదాపు రూ.5 వేలు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థి తుల్లో పశువులకు గడ్డి కొరత ఏర్పడిందని పాడి రైతులు గగ్గోలు పెడు తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఆదుకుంటుం దని ఆశిస్తే నిరాశే మిగిలింది. గత ప్రభుత్వం అమలు చేసిన పశుగ్రాస పథకాలను పక్కన పెట్టేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️