ప్రజాశక్తి – కిర్లంపూడి
మాల మహానాడు వ్యవస్థాపకులు పివి.రావు జయంతి సందర్భంగా కాకినాడలో మే 12న మాలల మహా రణభేరి కార్యక్రమాన్ని నిర్వమించనున్నట్లు రాష్ట్ర మాల సంఘాల జెఎసి అధ్యక్షులు పండు అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల మహారణభేరి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎస్సిలను అణిచివేసే కుట్రలో భాగమే వర్గీకరణ చేశాయని అన్నారు. ఎస్సిల ఐక్యతను కోరుకునే వారంతా వర్గీకరణను వ్యతిరేకించాలని కోరుతూ మే 12న కాకినాడలో నిర్వహించే మాలల మహా రణభేరి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు లింగ శివకుమార్, బుంగ సతీష్కుమార్, కండవెల్లి లోవరాజు, మర్ర చిట్టిబాబు, బులుపే గోపి, మద్దాల సురేష్, కాకర అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.