ప్రజాశక్తి – యంత్రాంగం
కాకినాడ పహల్గాంలో ఉగ్రదాడిలో మృతులకు సిపిఎం నివాళులర్పించింది. స్థానిక జడ్పి సెంటర్లో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, కె. సత్తిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.బేబిరాణి, పలివెల వీరబాబు, మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్, మేడిశెట్టి వెంకటరమణ, సి.వెంకట్రావు, కె.అప్పారావు, హుస్సేన్, విజయకుమారి, షంషుద్దీన్, అమృత, వి. శ్రీనివాస్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పహల్గాం మృతులకు పలువురు నివాళులర్పించారు. స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో కొవ్వొ త్తులతో మానవహారం నిర్వహిం చారు. ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున హిందూ, ముస్లీం, క్రైస్తవ మత స్తులు, బౌద్ధులు, మార్క్సిస్టులు, అంబేద్కర్ వాదులు పెన్షనర్స్ సంఘం, ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం ఉగ్రదాడిని నిరసిస్తూ జన విజ్ఞానం వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ మతోన్మాదాన్ని వీడి మతసామ్యరస్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జిఎస్.భాస్కర్, ఒడిశెట్టి సత్యనారా యణరెడ్డి, అప్పారావు, ప్రసాద్, ఏలేటి నాని, తుమ్మల సూరిబాబు, మణికంఠ, వి. ప్రసాద్, ఎ. రాజేష్ పాల్గొ న్నారు. ఏలేశ్వరం పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ స్థానిక బాలాజీ సౌక్ సెంటర్లో ప్రకృతి పరిరక్షణ సంఘం, ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్విజయబాబు మాట్లాడారు. తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు, టేకుమూడి ఈశ్వరరావు, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.