ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో ఎండలు సుర్రు మంటున్నాయి. విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ మీటరు గిరగిరా తిరుగుతున్నాయి. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కేటాయింపులు లేకపోవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. సరఫరాలో అంతరాయాలకు సాంకేతిక సమస్యలే కారణమని, ఆ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించి సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో రోజువారీగా విద్యుత వినియోగం 21మిలియన యూనిట్లకు పైగానే ఉంటోంది. అయితే కేటాయింపులు మాత్రం 20 మిలియన్ యూనిట్లే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా పెరిగిన వినియోగంఉమ్మడి జిల్లాలో 19.16 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 16.23 లక్షల గృహ కనెక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు, వాణిజ్యం, పరిశ్రమలు, తాగునీటి కనెక్షన్లు, వీధిలైట్లు తదితర కనెక్షన్లు 3.07 లక్షలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రోజువారీగా 20 మిలియన యూనిట్ల విద్యుత వినియోగం జరుగుతోంది. ఫిబ్రవరి నెలలో 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. మార్చిలో 19 నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య వినియోగం జరిగింది. తాజాగా ఏప్రిల్లో 20 మిలియన్ యూనిట్ల నుంచి 21 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గడిచిన మూడు నెలల్లో సరాసరి నాలుగు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు గణాంకాలు చెప్తున్నాయి. . సాధారణంగా ఎండాకాలంలో విద్యుత కేటాయింపులు కొంత ఎక్కువగానే ఉండాలి. అయితే వేసవి కాలంలో సాగు విస్తీర్ణం తగ్గుతుందన్న నెపంతో కేటాయింపులు తగ్గించినట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది.అప్రకటిత కోతలు షురూ జిల్లాలో విద్యుత్ వినియోగం కంటే కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఇటు గహాలకు..అటు వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుతలో కోతలు పడుతున్నాయి. వ్యవసాయాకి రెండు విడతలో 9గంటల విద్యుత సరఫరా చేయాల్సి ఉండగా.. సరాసరిన అర గంట నుంచి గంట సమయం వివిధ సాకుల పేరుతో కోత పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కరెంటు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు పడిపోయారు. ఇక పట్టణాలు, పల్లెల్లో గహాలకు సంబంధించి అనధికారికంగానే కోతలు అమలు అవుతున్నాయి. దీంతో వినియోగదారులు కరెంటు కష్టాలు తప్పడం లేదు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. అప్రకటిన విద్యుత్ కోతలను నిలిపేయాలని వేడుకుంటున్నారు.
