ప్రజాశక్తి – గండేపల్లి
శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 29వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ కరస్పాం డెంట్ ప్రవీణ్కుమార్ పాల్గొని మాట్లాడారు. శ్రీ గీతంలో విలువలతో కూడిన విద్యను గ్రామీణ ప్రాం తాల్లో విద్యార్థులకు అందించడం జరుగుతుం దని తెలిపారు. విద్యా విధానంలో సుదీర్ఘ అనుభవం కలిగిన కరస్పాండెంట్ విఎస్పి.చౌదరి గత 28 ఏళ్లలో వందలాదిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. కరస్పాండెంట్ విఎస్పి చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ప్రారంభించి 29 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు విద్యాసంస్థను నిర్వహించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సిబ్బం ది కారణమన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిధులు సత్తి బాబు, శ్రీనివాస్, గంగాధర్, వీరబాబు పాల్గొన్నారు.