ప్రజాశక్తి – కాకినాడ
కూటమి ప్రభుత్వ పాలనలో మత్య్సకారుల దశ మారిందని ఎంఎల్ఎ వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం బోటు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం రెట్టింపు చేసి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. గత పాలకులు మత్స్యకారులను నమ్మించి మోసం చేశారన్నారు. ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారుల సొమ్ములను దోచుకున్నారని, 2014లో తొలిసారిగా టిడిపి ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భృతిని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, నాయకులు బలసాడి రంగారావు, చింతా పేర్రాజు, పినపోతు తాతారావు, తదితరులు పాల్గొన్నారు.