ప్రజాశక్తి – యు.కొత్తపల్లి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో బుధవారం నుంచి ఉప్పాడ సము ద్ర తీరంలో ఒక మీటర్ ఎత్తున అలలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతు న్నాయి. దీంతో మత్స్యకారులు వేటను నిలిపివేశారు. బోట్లను అమీనాబాద్ తీరం వద్ద లంగరు వేశారు. వేత విరామం తరువాత వరుసగా వస్తున్న తుపానుల వల్ల వేట లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర అలలు ఎగసి పడటంతో బీచ్రోడ్డులో వాహదారులు ఇబ్బందులు పడ్డారు.