ప్రజాశక్తి-ఏలేశ్వరం మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రత్తిపాడు ఎంఎల్ఎ వరుపుల సత్యప్రభ అన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవన్లో బిసి, ఇడబ్ల్యుఎస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు 90 రోజుల పాటు కుట్టు శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరికీ రూ.25 వేల విలువైన కుట్టు మిషన్లు ఆమె అందజేశారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వివిధ పనిముట్లు, యంత్ర సామగ్రిని, భూ సార ఆరోగ్య కార్డులను అందజేశారు. మండలంలోని రమణయ్యపేటలో చేతి పంపుల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రెండు నెలలుగా అనారోగ్యంతో ఉన్న కూటమి శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివద్ధి పనులను కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, వైస్ ఎంపిపి చిక్కాల రాజేశ్వరి జనసేన నేత మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) టిడిపి నాయకులు సూతి బూరయ్య, ఎస్ జీ వి సుబ్బరాజు, బుద్ధ సూర్య ప్రకాష్, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జి, మైరాల కనకారావు, ఎంపిడిఒ కెవి.సూర్యనారాయణ, వ్యవసాయ అధికారి బి.జ్యోతి, కూటమి నాయకులు ఉన్నారు.
