నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి : ఎంపీడీవో రాజు

May 5,2025 17:38 #alamuru, #Konaseema, #mpdo

ప్రజాశక్తి – ఆలమూరు : అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఇంచార్జ్ డిఎల్పిఓ ఎంపీడీవో ఎ.రాజు అన్నారు. మండలంలోని గుమ్మిలేరులో జలజీవన్ మిషన్ ద్వారా మంజూరైన రూ. 28 లక్షలతో 40 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పి.పద్మ వెంట రాగా సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా అందిస్తున్న ఇంటింటి త్రాగునీరు పథకాన్ని అందించే లక్ష్యంలో భాగంగా ట్యాంక్ నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణాలు త్వరితగతన పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆయన ఆదేశించారు. అలసత్వం వహించవద్దని, తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️