ప్రజాశక్తి – ఆలమూరు : గ్రామాల్లో డ్రైనేజీ వ్యర్ధాలు పంట బోదెల్లో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు ఇన్చార్జి డిఎల్పిఓ, ఎంపీడీవో ఏ.రాజు ఆదేశించారు. మండలంలోని పెద్దపళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారపాటి శ్రీనివాసరావు, సిబ్బంది వెంట రాగా పంటబోదెలను సోమవారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బోదుల్లో ఉన్న పరిస్థితిని చూసి దిగువకు సాగునీరు ఎలా వెళుతుందని పంచాయతీ అధికారులను నిలదీసి వెళ్లే మార్గం వెంటనే చూడాలన్నారు. అందుకు శాశ్వత పరిష్కారం చెయ్యాలని అధికారులకు ఆయన వివరించారు. తక్షణం ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించాలని పంచాయతీ సెక్రెటరీ సూచించారు. మా పరిధిలో ఉన్న బోధి గనుక మేము సహకరిస్తామని నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీవో శాశ్వత పరిష్కారం చేస్తానని గ్రామస్తులకు కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పించి చెత్తను వ్యర్ధాలను బోదుల్లో వేయకుండా సీసీ పర్యవేక్షణలో ఉంచి చూడాలని ప్రతిరోజు బోదులు శుభ్రపరచాలని పంచాయతీ సిబ్బందితో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యశ్రీ మెహర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వి.వేణి, పంచాయతీ సిబ్బంది నాగేశ్వరరావు, వీఆర్వో ఉదయ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
