కిషోర బాలికల వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందాలి : ఎంఈవో సుబ్బరాజు

Feb 4,2025 15:40 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు: కిషోర బాలికల వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎంఈఓ పి.వి.సుబ్బరాజు అన్నారు. మండలంలోని చెముడులంక ఎస్టిఎస్ఎన్ఎం జడ్పీ హైస్కూల్లో మంగళవారం కిషోర బాలికల వికాసంపై ఐసిడిఎస్ ఆధ్వర్యంలో హెచ్ఎం శ్రీరామ్ కుమార్ అధ్యక్షతన విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో వ్యక్తిగత ఆరోగ్యం, రక్త హీనత, మహిళా అక్రమ రవాణా, లింగ వివక్షత, బాల్య వివాహాలు నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను వారు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గా, ఏఎన్ఎం మంగాయమ్మ, సూపర్వైజర్లు టిఎన్వీ నాగలక్ష్మి, వై.అరుంధతి, సిఆర్పి శ్రీనివాస్, అంగన్వాడీలు సుశీల, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️