బెండ సాగుపై అవగాహనా సదస్సు

May 10,2025 17:02
alamuru

క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న అడ్వాంటా గోల్డెన్‌ సీడ్స్‌ సభ్యులు

ప్రజాశక్తి – ఆలమూరు

మండలంలోని చొప్పెల్లలో రైతులకు అడ్వాంటా గోల్డెన్‌ సీడ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు బెండ సాగుపై అవగాహనా సదస్సు సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా టెరేటరీ సేల్స్‌ మేనేజర్‌ కె.రాజుకుమార్‌, మార్కె టింగ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ పి.సత్య వరప్రసాద్‌ మాట్లాడుతూ రైతులకు హైబ్రిడ్‌ బెండ సాగులో ఎటువంటి విత్తనాలు వేయాలో, అధిక దిగుబడి, దీర్ఘ కాలిక ఫలదీకరణ, రోగ నిరోధికత, ఆకర్షనీయమైన రంగు, ఆకారాలు ఎలా సాధించాలో వివరించారు. భూ స్థితి దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంతవరకు ఏ విధంగా సాగు చేయాలో తగిన సలహాలు, సూచనలతో వివరించారు. అలాగే కాసా హైబ్రిడ్‌ బెండీ ఏడివి 842 రకం విత్తనాలు గురించి రైతులకి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు.

➡️