పాడిరైతుల పురోభివృద్ధికి గోకుల దోహదం

Jan 11,2025 16:41
gokul

నవాబుపేటలో గోకుల షెడ్డును ప్రారంభిస్తున్న ఎంపిడిఒ రాజు

ప్రజాశక్తి – ఆలమూరు

పాడి రైతుల పురోభివృద్దికి మినీ గోకులాల షెడ్లు దోహదం చేస్తాయని ఎంపిడిఒ, ఇన్‌ఛార్జి డిఎల్‌పిఒ ఎ.రాజు అన్నారు. మండలంలోని నవాబుపేటలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన గోకుల షెడ్డును ఆయన స్థానిక నేతలతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ రాజు మాట్లాడుతూ పాడి, పంటలు మన సంస్కతికి పునాదులని వాటిని కాపాడుకోవాలని రైతులకు గుర్తు చేశారు. అందుకే పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగ పడుతుందన్నారు. అలాగే మండలంలో మొత్తం 49 గోకులాలు అర్హులకు మంజూరు చేయగా అందులో 22 ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణతో తప్పకుండా పూర్తి చెయ్యాలని వారికి ఆదేశించారు. మన పల్లెల్లో సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకునేందుకు వీటి నిర్మాణంతో శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ నామాల సత్తిబాబు, మాజీ సర్పంచ్‌ గురు చంద్ర స్వరూప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పెద్దిరాజు, కూటమి నాయకులు ఈత సుబ్బారావు, గోపి రాముడు, సింగం శెట్టి రాజు, వరసాల అన్నవరం, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️