అంబాజీపేట సెంటర్ లో సియం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలలో కూటమి శ్రేణులు
ప్రజాశక్తి – అంబాజీపేట
ప్రజల కోసం అలుపెరగని కృషి చేస్తూ ధార్శనికతకు నిలువటద్దం.. నవ్యాంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అని పి.గన్నవరం నియోజకవర్గం టిడిపి కో కన్వీనర్ డివివి.సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆదివారం అంబాజీపేట నాలుగు రోడ్ల సెంటర్, కె.పెదపూడి, పుల్లేటికుర్రు మరియు మండల పలు గ్రామాలలో ఆదివారం కేకు కట్ చేసి స్వీట్లు పంచి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎపి రాజకీయ గగన స్థలంలో తన అసాధారణ దూర దృష్టితో ఒక నక్షత్ర సముదాయంగా ఉద్యవించిన నాయకుడు అని డివివి పేర్కొన్నారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో సమర్థవంతమైన పాలనకు చిరునామాగా చంద్రబాబు ప్రజల హదయాలలో నిలిచారన్నారు. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిస్వార్థ రాజకీయాలతో దేశంలోనే తనదైన ముద్ర వేసుకున్న చంద్రబాబును నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ గణపతి వీర రాఘవులు మాట్లాడుతూ భారత్ అంటే ఢిల్లీ, బొంబాయి, కలకత్తా కాదని తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక దార్శనికుడు చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర ఎస్సి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెదపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించి దేశానికి చూపించి ప్రపంచ దిగ్గజాలను ఆంద్రాకు రప్పించిన విజన్ గల ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గుడాల ఫణి మాట్లాడుతూ ప్రతిక్షణం-ప్రజా సంక్షేమం ప్రతి ఆలోచన అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న ఆయన విజన్, ఉత్సాహం నేటి యువతకు, నేతలకు ఆదర్శప్రాయం, అనుచరనీయమన్నారు.ఈ కార్యక్రమంలోమండల టిడిపి అధ్యక్షులు డి.శ్రీనురాజు, జనసేన అధ్యక్షులు డి.సాయికృష్ణ, నాగాబత్తుల సుబ్బారావు, రవణం రాము, చిన్నం విజయారావు, పత్తి దత్తుడు, పళ్ల శ్రీను, కత్తుల బాబులు, కొర్లపాటి గోపి, ఎమ్.తాతాజీ, అధికారపు బాబ్జి, వక్కలంక కళ్యాణ్, ఏడిద నాగబాబు, పెచ్చెట్టి హరిబాబు, నియోజకవర్గ, మండల కూటమి శ్రేణులు పాల్గొని బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.