ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చింతలూరు నూకాంబికా అమ్మవారికి దాతల సహకారంతో సేకరించిన 4.25 కేజీల వెండితో రూపొందించిన రూ.4.50 లక్షల విలువైన ఆభరణాలను ఆదివారం గ్రామానికి చెందిన మహిళలు ఆలయ కమిటీ అందజేశారు. మండపేటకు చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ ఈ ఆభరణాలు రూపొందించారు. ఆదివారం చైత్ర అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నూతనంగా రూపొందించిన అమ్మవారి కుడి చేతి కవచం, పిడికిలి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, అల్లంరాజు రామకృష్ణమూర్తి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ని వెంకట్రావు, వైట్ల శేషుబాబు, ఏ.శివన్నారాయణ, దాసరి సుబ్బారావు, పలువురు మహిళలు పాల్గొన్నారు.
