ప్రజాశక్తి – అమలాపురం
తీర ప్రాంత రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పర్యావరణ అనుకూలమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జిల్లాలో సముద్రపు నాచు సాగును (సి వీడ్ ఫామింగ్) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిపుణులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ప్రాజెక్టును అమలు చేయడానికి ముందడుగులు వేస్తున్నారు.సముద్రపు నాచు సాగు పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తమిళనాడు మండపం లోని సిఎస్ఐఆర్, సిఎస్ఎం సిఆర్ఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సముద్రపు నాచు జాతులలో అనుభవమున్న డాక్టర్ సతీష్, జిల్లా మత్స్యశాఖ, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ ఇతర నిపుణులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్రపు నాచు పెంపకంతో రైతులకు సమాచాలకు పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందని ఆ దిశగా జిల్లాలో సముద్రపు నాచు పెంపకానికి శ్రీకారం చుడుతూ సముద్ర తీరం వెంబడి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడానికి అధ్యయన పర్యటనలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా సముద్రపు నాచు సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడం ముఖ్యమైన అంశమన్నారు. సముద్రపు జలాలలో సంబంధిత సాగును చేపట్టాలా లేదా తీర ప్రాంతాలలో కత్రిమంగా ఉప్పునీటి చెరువులను ఏర్పాటు చేసి సాగు చేసే అంశంపై నిపుణుల క్షేత్రస్థాయిలో పర్యటించి అనువైన ప్రదేశాలను గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు.సమావేశం అనంతరం కాట్రేనికోన మండలంలోని కొత్తపాలెం, పల్లం, నీళ్లరేవు, చిరయానం, గచ్చకాయలపొర, ఉప్పలగుప్తం మండలంలోని ఎన్ కొత్తపల్లి, ఎస్ యానాం, వాసాల తిప్ప, మామిడికుదురు మండలంలోని గోగన్నమఠం కరవాక గొల్లపాలెం తూర్పు పాలెం, సఖినేటిపల్లి మండలంలోని చింతల మోరి, కేశవదాసు పాలెం అంతర్వేది, గొంది ఎన్ రామేశ్వరం కొమరగిరిపట్నం ఓడరేవు రెబ్బనపల్లి తదితర గ్రామాలలో సముద్రపు నాచు సాగుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు డాక్టర్ సతీష్ నేతృత్వంలోని నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు మే 7 నుంచి 8 వరకు స్థల పరిశీలన చేపట్టడానికి బయలుదేరారు . మే 8 గురువారం రోజున క్షేత్రస్థాయి పర్యటన పూర్తి చేసుకొని జిల్లా కలెక్టర్కు పూర్తి అధ్యయన నివేదికను సమర్పించనున్నారు. ప్రధానంగా సాగు చేయనున్న సముద్రపు నాచు జాతులు కప్ప ఫైకస్ అల్వారెజీ : దీనిద్వారా కేరాజినన్ అనే పదార్థాన్ని పొందుతారు. ఇది ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలలో స్థిరపదచే పదార్థంగా ఉపయోగిస్తారు.గ్రాసిలేరియా ఎడ్యులిస్ : దీని ద్వారా ఆగర్ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. ఇది మైక్రో బయాలజీ లాభాలు, ఆహార పరిశ్రమ, ఔషధాల తయారీలో విస్తతంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా రెండు జాతులు కూడా పంటల సాగులలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పంటల వద్ధిని పెంచే సహజ ఉత్పత్తులైన జీవ వద్ధి ఉద్దీపకాలుగా కూడా ఉపయోగిస్తారు. ఆదాయం, పర్యావరణ ప్రయోజనాలుజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సముద్రపు నాచు సాగు తీర ప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయం కల్పిస్తుందన్నారు. దీంతోపాటు కార్బన్ శోషణ చేయడం ద్వారా సముద్ర జీవవైవిధ్యం పెంపు, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల సమకూర్పుఅనువైన ప్రదేశాలను ఎంపిక చేసిన తర్వాత డిఆర్డిఎ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, సాంప్రదాయ మత్స్యకారులు, యువకులలో ఔత్సాహికులను గుర్తించి వారికి సముద్రపు నాచు సాగులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ మరియు నాబార్డ్ నిధులు సమకూర్చనున్నాయన్నారు. ఈ రెండు సంస్థలు పర్యావరణ అనుకూల గ్రామీణ జీవనోపాధి ప్రోత్సాహక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వనున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకతసమద్ధమైన సముద్ర జలాలు, అనుకూలమైన తరంగ ప్రవాహాలు, పుష్కలమైన పోషకాలు కలిగిన కోనసీమ తీర ప్రాంతం సముద్రపు నాచు సాగుకు అనుకూలమైనదని, పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఇతర మండలాల్లోకి విస్తరించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. మెరైన్ రీసెర్చ్ సంస్థలు, ఫిషరీస్ విశ్వవిద్యాలయాల తో కలిసి శాస్త్రీయ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కృషి చేస్తున్నా మని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ బ్లూ ఎకానమీ, ఎపి ప్రభుత్వ సుస్థిరమైన గ్రామీణ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండేవిధంగా రూపుదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సిఎస్ఐఆర్ మండపం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.సతీష్, అమలాపురం ఆర్డిఒ కె.మాధవి, జిల్లా ఫిషరీస్ అధికారి పివి.శ్రీనివాసరావు, డిఆర్డిఎ పీడీ నాగేశ్వరరావు, కాకినాడ మత్స్యశాఖ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి.ప్రసాద్ రావు, నాబార్డ్ జిల్లా మేనే జర్ స్వామి నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రతినిధి శ్రీహర్ష, శాస్త్రవేత్తలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.