గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

May 9,2025 16:39
IMG-

అంగర పిహెచ్‌సిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ రత్నకుమారి

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం

గర్భిణులు ప్రతినిత్యం పౌష్టికాహారం తీసుకుని వైద్య సలహాలు పాటించడం ద్వారా పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారని అంగర పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ పి.రత్నకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కపిలేశ్వరపురం మండలంలోని అంగర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల్లో వైద్యాధికారిణి రత్నకుమారి 19 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేశారు. అనంతరం గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, ప్రధానమంత్రి వందన యోజన పథకం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ఆరోగ్య ఆసరా, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను డాక్టర్‌ రత్నకుమారి, ఎంపిహెచ్‌ఇఒ జె.మల్లికార్జునుడు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బి.రామారావు వివరించారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఒ మల్లికార్జునుడు, హెచ్‌ఇ బి.రామారావు, హెల్త్‌ విజిటర్‌ టి.మేరీమణి, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, అంగనవాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్బిణులు, పాల్గొన్నారు.

➡️