ఎంపిడిఒ రాజుకు వినతి పత్రం అందజేస్తున్న ఫీల్ అసిస్టెంట్లు
ప్రజాశక్తి – ఆలమూరు
ఉపాధి హామీ చట్టంలొ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను గ్రామస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలంటూ ఎంపిడిఒ ఎ.రాజుకు మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 19 ఏళ్లుగా గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమను గ్రామ పంచాయతీ సిబ్బందిగా క్రమబద్ధీకరించాలన్నారు. మండలం యూనిట్ గా తీసుకుని అంతర్గత బదిలీలు చేపట్టడం ద్వారా స్థానిక ఒత్తిడిలను అధిగమించి మరింత సమర్థవ ంతంగా పనిచేసేందుకు వీలు కల్పించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్టిఇ ఇచ్చి పూర్తిస్థాయి హెచ్ఆర్ పాలసీ, హెల్త్కార్డు, ప్రమాద బీమా, గ్రాడ్యుటి వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. 2016-19 సంవత్సరాల మధ్య కాలంలో ఎన్ఆర్ఇజిఎస్ లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు జీతాలు పెరిగాయని, ఫీల్ అసిస్టెంట్లకు మాత్రం పెరగలేద న్నారు. మాకు కూడా అదే స్థాయిలో జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యాఅర్హతల ఆధారంగా కంప్యూటర్ ఆపరేటర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించాలని వారు కోరారు. పై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపిడిఒకు అందజేశామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి ఫీల్ అసిస్టెంట్లు పెద్దిరాజు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.