ప్రజాశక్తి – అమలాపురం
విభిన్న అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డిఆర్ఒ రాజకుమారి, డ్వామా, డిఆర్డిఎ పీడీలు మధుసూదన్, జయచంద్ర గాంధీ, ఎస్డిసి కృష్ణమూర్తి, డిఎల్డిఒ రాజేశ్వరరావులతో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల నుంచి సుమారు 200 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీ స్థాయిని అంచనా వేసి రిక్వెస్ట్ లేదా ఫిర్యాదు విశ్లేషించి సత్వరమే స్పందిస్తూ హేతుబద్ధత కలిగిన పరిష్కారం చూసినప్పుడే వివిధ సమస్యలకు పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా, ఒకసారి ఒక అంశంపై సమర్పించిన అర్జీ మరల అదే అంశంపై పునరావృతం కాకుండా మెలకువలు పాటించాలన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం దిశలో క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై అర్జీదారుల సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, వినతుల పరిష్కారంలో ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు, వైద్యులు అందుబాటు, గ్రామాల్లో పారిశుధ్య సేవలకు సిబ్బంది అందుబాటులో ఉండటం లాంటి అంశాల్లో ఇంకా సంతృప్తి పెరగాల్సిన అవసరముందన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరి ష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీదారుల సమస్యను సావధానంగా, ఓపిగ్గా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంద న్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వేదిక కార్యక్రమానికి విచ్చేసే అర్జీదారుల సమస్య పరి ష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగిం చాలన్నారు. అర్హతను పరిశించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారునికి వివరించాలన్నారు. పరిష్కారమైన అర్జీదారులతో ఐవిఆర్ఎస్ ద్వారా ఉన్న తాధికారులు వారి సంతృప్తి స్థాయిని తెలుసు కోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.