ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

May 9,2025 16:40
IMG

మండపేటలో ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నఎంఎల్‌ఎ జోగేశ్వరరావు

ప్రజాశక్తి – మండపేట

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యముగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని రాష్ట అంచనాల కమిటీ ఛైర్మన్‌, మండపేట ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎంఎల్‌ఎ వేగుళ్ళ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతీ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతీ అర్జీని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి వాటి పై చర్యలు తీసుకుని సమస్య పరిష్కరిస్తామని ఎంఎల్‌ఎ వేగుళ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, పాల్గొన్నారు.

➡️