కోనసీమ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలి

Jan 16,2025 18:03
IMG

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – అమలాపురం

జిల్లాస్థాయిలో ఈనెల 21, 22 తేదీలలో నిర్వ హించ నున్న ‘కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో ఆరోగ్యం’ కార్యక్ర మాలను విజయ వంతంగా నిర్వహించేందుకు పటిష్ట మైన ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో విద్యాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టరేట్‌ అధికారులతో జిల్లాస్థాయి కోనసీమ క్రీడోత్స వాలు ఆటలతో ఆరోగ్యం కార్య క్రమాల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన 7, 8, 9 తరగతుల క్రీడాకారులకు స్థానిక జిఎంసి బాల యోగి స్టేడియం నందు జిల్లా స్థాయి క్రీడా పోటీ లను ఈనెల 21, 22 తేదీలలో ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. మండల స్థాయి నుంచి సుమారుగా 2,700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని వారికి అవసరమైన త్రాగునీరు వసతి అల్పాహారం భోజన, మౌలిక వసతు లు కల్పనకై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడు డివిజన్ల వారీగా క్రీడా పోటీలు నిర్వ హించి ఫైనల్‌ కు చేరిన మూడు డివిజన్లు బందాలు జిల్లా స్థాయిలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. అథ్లెటిక్స్‌ గేమ్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, కో కో బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించి ఈనెల 22 వ తేదీ సాయంత్రం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గా మెడల్స్‌ ప్రశంస పత్రాలు బహూకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 21న 22న మండలాలలో గెలుపొందిన బృందాలు క్రీడాం శాలలో పాల్గొంటారన్నారు. వీరిలో సెమీఫైనల్‌కు చెందినవారికి 22న సెమీఫైనల్‌ ఫైనల్‌ పోటీలను నిర్వహించి సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహిస్తారన్నారు. స్టేజ్‌ టెంట్లు, కుర్చీలు, వసతి కొరకు పరుపులు దుప్పట్లు వంటి ఏర్పాట్లను చేపట్టా లన్నారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన బాలికలు, బాలురకు గేములు క్రీడల పోటీలను విడివిడిగా నిర్వహిస్తారన్నారు. మున్సిపల్‌ అధికారులు పారిశుధ్య ఏర్పాట్లు, ట్రాన్స్‌కో వారు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఆర్డబ్ల్యూఎస్‌ విభాగం తాగునీరు ఏర్పాట్లు చేపట్టా లని ఆదేశించారు. క్రీడల నిర్వహణకు అయ్యే అంచనా వ్యయాలను నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ కె.మాధవి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పిఎస్‌.సురేష్‌ కుమార్‌, కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరిం టెండెంట్‌ మురళీకృష్ణ, పరిపాలనాధికారి కె.కాశీవిశ్వేశ్వరరావు, పంచాయ తీరాజ్‌ ఎస్‌ఇ పి.రామకృష్ణారెడ్డి స్కూల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ పిఇటి అసోసియేషన్‌ కార్యదర్శి బివిఎస్‌ఎన్‌.మూర్తి స్టేడియం కోచ్‌, భీమేష్‌ పిఇటిలు గణేష్‌ , పి.రవి తదితరులు పాల్గొన్నారు.

 

➡️