ద్వారపూడిలో కుటు శిక్షణ కేంద్రంలో మాట్లాడుతున్న ఎంఎల్ఎ వేగుళ్ల
ప్రజాశక్తి – మండపేట
మహిళలకు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎంఎల్ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. గురువారం మండపేట మండలం, ద్వారపూడి గ్రామంలో బిసి కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎంఎల్ఎ వేగుళ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారితకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలందరికీ వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపరచడంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాలలో 90 రోజులు పాటు ఈ శిక్షణ ఇచ్చిన అనంతరం కుట్టుమిషన్ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల టిడిపి అధ్యక్షులు యరగతపు బాబ్జి, గ్రామశాఖ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ, చేకూరి రమేష్రాజు, చింతా దొరబాబు, కంకటాల మురళీ కృష్ణ, అడబాల వెంకటరాజు, సలాది బాలసుబ్రహ్మణ్యం, పల్ల బాబు, తానంకి చంద్రశేఖర్ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.