ప్రజాశక్తి-బత్తలపల్లి (అనంతపురం) : శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీగా బత్తలపల్లికి చెందిన కోటి సురేశ్ కుమార్ ఎంపికయ్యారు. పార్టీ అధినేత జగన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివఅద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.