ఘనంగా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 44వ వార్షికోత్సవ వేడుకలు

Feb 16,2025 11:45 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : క్రీడా, సాంస్కృతిక మరియు సాంకేతిక విద్యా విజయాల వేదిక అయిన గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 44 వ వార్షికోత్సవ సంబరాల్ని శనివారం రాత్రి జరుపుకోగా, ఈ కార్యక్రమానికి సెక్రటరీ I/C, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, ఆంధ్ర ప్రదేశ్. జి.వి.రామచంద్ర రావు ముఖ్య అతిధిగా, పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి, డా.పి.శ్రీహరి, ప్రొఫెసర్ ఆఫ్ ఈ.సి.ఈ, చీఫ్ ఇన్వెస్టిగేటర్, ఎలక్ట్రానిక్స్ & సి.ఐ.టి.అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. గౌరవ అతిధిగా, మరొక ముఖ్య అతిధి సూరపనేని వెంకటరత్నం, ఎన్ ఎస్ ఎఫ్ ఐ లోకల్ చాప్టర్ చైర్మన్ విచ్చేయగా కార్యక్రమాన్ని గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ ఘనంగా జరుపుకుంది.
తొలుత కార్యక్రమాన్ని ముఖ్య అతిధి, విశిష్ట అతిధులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించగా ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ అద్యక్షత వహించి ప్రిన్సిపాల్ రిపోర్ట్ లో 2024-25 సంవత్సరం లో పాలిటెక్నిక్ జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సాధించిన విజయాలు, వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న విజయాలు వివరిస్తూ విద్యార్దులను అభినందిస్తూ ఉపన్యసించారు.
గౌరవ అతిధిగా విచ్చేసిన పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి, డా.పి.శ్రీహరి మాట్లాడుతూ తాను చదివిన కళాశాలకే అథితిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని, నేను ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం ఈ పాలిటెక్నిక్ అని ఇక్కడున్న సదుపాయాలు, సలహాలు ఎవ్వరినైనా మార్చేయగలవని పేర్కొంటూ, విద్యార్థుల నృత్య ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని సంతోషాన్ని వ్యక్తం చేసారు. విద్యార్థులందరూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన సెక్రటరీ I/C, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, ఆంధ్ర ప్రదేశ్. జి.వి.రామచంద్ర రావు మాట్లాడుతూ గోల్డ్ మెడల్స్ మరియు కాష్ అవార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించడానికి ప్రస్తుత పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ప్రతి విద్యార్థి మీయొక్క కుటుంబ పరిస్థితులను బట్టి మీ భవిష్యత్తును చక్కని మార్గంలోకి మలచుకోవాలని, మీరంతా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, అంతేకాకుండా విద్యార్థులు మొదట క్రమశిక్షణను అలవర్చుకోవాలని అలాంటి విద్యార్థులే గొప్ప స్థాయికి చేరుకుంటారని, అలాగే విద్యార్థులు డిప్లొమా అయిన తరువాత ఉద్యోగాలపై దృష్టి పెట్టినట్లయితే మంచి అనుభవంతో పాటు, ఆదాయము కూడా గడించి ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని సలహా ఇచ్చారు.
మరొక ముఖ్య అతిధి సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ నాకెంతో ప్రత్యేకమని ప్రతి ఏటా నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా వచ్చే స్కాలర్స్ ఎక్కువగా ఈ పాలిటెక్నిక్ కే వస్తాయని తెలియజేసారు.
అదే విధంగా ఇసిఇ చివరి సంత్సరం చదువుతున్న కుమారి ఆలూరి లలిత కోమలి, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా ఎంపికైనందుకు సంతోషంగా వుందని ఈ స్థానంలో నిలబడానికి కారణం తన అద్యాపకులు మరియు తల్లి దండ్రులు కారణమని మరియు విద్యను ఒక లక్ష్యంతో అభ్యసిస్తూ తమ వంతు కృషి చేస్తే విజయాలు తప్పక వరిస్తాయని తన తోటి విద్యార్ధులకు వివరించింది. తనకు సహకరించిన ప్రిన్సిపాల్ కి, అద్యాపకులకు, యాజమాన్య సిబ్బందికి తన కృతఙ్ఞతలు తెలిపింది.
అలాగే ఎ.ఐ.ఎమ్.ఎల్ చివరి సంత్సరం చదువుతున్న భూక్యా జయ కుమార్, ఓవరాల్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్పోర్ట్స్ పర్సన్ గా ఎంపికైనందుకు సంతోషంగా వుందని విద్యార్దులు అందరు కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు ఆటలలో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవలని తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. తనకు సహకరించిన ప్రిన్సిపాల్ కి, అద్యాపకులకు, యాజమాన్య సిబ్బందికి, ఫిజికల్ డైరెక్టర్ కి తన కృతజ్ణాతలు తెలిపాడు.
అనంతరం 2021-24 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిలో బ్రాంచ్ టాపర్స్ కు బంగారు పతకాలను అందచేశారు. అలాగే 2024 -ఈసెట్ లో టాప్ ర్యాంకులు సాధించిన వారికీ నగదు పారితోషకాలతో ప్రోత్సహించారు. అలాగే 2021-24 లో పాలిటెక్నిక్ విద్యాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ పాలిటెక్నిక్ టాపర్ గా నిలిచిన కుమారి ఆలూరి లలిత కోమలి, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా , వివిధ స్థాయిల ఆటల పోటిలలో విశేష ప్రతిభ కనబరిచిన భూక్యా జయ కుమార్ ని పాలిటెక్నిక్ క్రీడా క్రీడాకారుడిగా గుర్తించి జ్ణాపికను ముఖ్య అతిధుల చేతులు మీదుగా అందించారు. అలాగే ద్వితియ మరియు తృతియ సంత్సరాలలో టాపర్స్ గా నిలిచిన వారికి రూ. 35,000/- విలువగల పుస్తకాలను బహుకరించారు.
పాలిటెక్నిక్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో 100% ఉత్తీర్ణత సాధించిన అధ్యాపకులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అదించడం జరిగింది.
కార్యక్రమంలో చివరిగా పాలిటెక్నిక్ విద్యార్ధులు ఆటపాటలతో అలరించంగా కార్యక్రమానికి యాజమాన్య సభ్యులు, ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు , సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ వి.సత్యనారాయణరావు, కో-సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ శ్రీ వి.రామకృష్ణ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కరుణ కుమార్, ఫార్మసి కాలేజ్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణరావు , ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ ఇంగ్లీష్ మీడియమ్ హై స్కూల్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస మూర్తి, ప్రిన్సిపల్ సాతులూరి లీనా మరియు పాలిటెక్నిక్ విభాగాదిపతులు, అద్యాపకులు మరియు అద్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు

➡️