ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ కృష్ణలంకలోని కృష్ణచైతన్య పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభంజనం సృష్టించారు. ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయదుందుబి మోగించారు. తుమ్మలపల్లి మహేశ్వరి 600 మార్కులకు గాను 594 సాధించారు. సానికొమ్ము కమల్సాత్విక్ 586, ముక్కుమాల సాయి సాహిత్య 583 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. కృష్ణలంక ప్రాంతంలో మరే ఇతర పాఠశాలల విద్యార్థులకు ఈ స్థాయిలో మార్కులు రాలేదు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కృష్ణచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్. ప్రవీణ్రెడ్డి అభినందించారు. తుమ్మలపల్లి మహేశ్వరి 594, సానికొమ్ము కమల్సాత్విక్ 586, ముక్కుమాల సాయి సాహిత్య 583 మార్కులు సాధించి మంచి ఫలితాలు సాధించారన్నారు. తమ పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని వివరించారు.
