తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని … నేడు తిరుమలలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు, సతీమణి శిరీషతోపాటు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ …. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.