ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లా ఎస్పీ గా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించిన సంధర్బంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ ని సంకల్ బాగ్లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవలసిన పలు అంశాలపై చర్చించారు.
