ప్రజాశక్తి-ఆదోని: సామాజిక సేవలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని సమాజ అభివృద్ధి కొరకు పాటుపడాలని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ గోపీనాథ్ పేర్కొన్నారు మున్సిపల్ రోడ్డులోని రాయల్ ట్రేడర్స్ ముందు ఉచిత చదివేంద్రం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడాలి ఆదోని నియోజకవర్గం లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామన్నారు. అందులో భాగంగా వేసవికాలంలో ఆదోనికి వచ్చి పోయే జనాలకు చల్లటి మంచినీరు అందించే లక్ష్యంగా ఈ చదివేంద్రము ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ప్రసాదరావు, క్లబ్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, కార్యదర్శి శ్రీనాథ్ గుప్తా, విశిష్ట సభ్యులు నీల మోహన్, ఓం ప్రకాష్, వనప రాజు వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
