వీకోట (చిత్తూరు) : లారీ అదుపుతప్పి స్కూల్ ప్రహరీ గోడను ఢీకొట్టడంతో స్కూల్ సిబ్బందికి గాయాలైన ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. కొమ్మరమడుగు క్రాస్ వద్ద అగ్గిపెట్టెల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి స్కూల్ ప్రహరీ గోడను ఢకొీట్టింది. ఈ ఘటనలో స్కూల్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారంతా వీకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
