ప్రజాశక్తి – విజయనగరం : జాతీయ రహదారి నాతవలస టోల్ ప్లాజా సమీపంలో రెండు లారీలు వెనుక నుంచి ఒక దాన్ని ఒకటిఢీ కొన్నాయి. దీంతో వెనుక నుంచి ఢీకొన్న లారీలో డ్రైవర్ చిక్కిపోయాడు. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో అదే లారీ లో జూటు సంచులు ఉండడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అగ్నికి ఆహుతి అయ్యాడు. లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంజన్ లో మంటలు చెలరేగి.. లారీ డ్రైవర్ అగ్నికి ఆహుతి
