లక్ష్మీప్రియకు ఘన సన్మానం

ప్రజాశక్తి-రాచర్ల : రాచర్ల మండలం ఆకవీడు గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని బచ్చిగారి లక్ష్మీప్రియ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విశిష్ట ర్యాంకును సంపాదించింది. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకొని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మీప్రియ వంటి మేధావులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని, లక్ష్మీప్రియ ప్రతిభకు అనుగుణంగా త్రిబుల్‌ ఐటిలో సీటు లభించే అవకాశం ఉందని, అక్కడ కూడా మరింత కృషి చేసి, తన ప్రతిభతో గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో లక్మీప్రియ తన విజయం గురించి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల సహాయ సహకారాల వల్ల తాను ఘనవిజయం సాధించానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తన ఊరు, పాఠశాల ఉపాధ్యాయులు గర్వపడేలా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ అభినందన కార్యక్రమంలో ఆకవీడు జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బివి సుధాకర్‌రావు, విద్యార్థిని తండ్రి శేఖర్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️