70 అడుగులకు వినుకొండ మెయిన్‌ రోడ్డు విస్తరణ

May 7,2025 21:13

ప్రజాశక్తి – వినుకొండ : పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాల రీత్యా వినుకొండ పట్టణం ప్రధాన రహదారిని 35 నుంచి 70 అడుగులకు విస్తరిస్తామని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. ఈ మేరకు డిసిసిబి చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎంపిడిఒ కార్యాలయం వైపు రోడ్డును 35 నుంచి 70 అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నామని, ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని అనారు. మండల కార్యాలయం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లో పైరూములు ఎంతోకాలంగా నిరుపయోగంగా ఉన్నందున తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. చోరీలు, రౌడీయిజం వంటి సమస్యల అదుపు కోసం అవసరమైన చోట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన చోట్ల ఇంకా ఏర్పాటు చేయాలన్నారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పట్టణంలోని ట్రాఫిక్‌, శాంతిభద్రతలు సహా అవసరమైన చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు.

➡️