పాచిపెంట : అక్రమంగా తరలిస్తున్న 127 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం సాలూరు సిఐ పి.రామకృష్ణ పాచిపెంట పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాచిపెంట మండలం పద్మాపురం జంక్షన్ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా ఆగి ఉందని విఆర్ఒ రామారావు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎస్సై వెంకటసురేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని కారును తనిఖీ చేయగా, నాలుగు బ్యాగుల్లో సుమారు రూ.12 లక్షలు విలువచేసే 127 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. గంజా యిని తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారని, కారును సీజ్ చేసినట్లు తెలిపారు. గత నాలుగు నెలల్లో సుమారు 1664 కేజీల గంజాయిని ఎస్సై వెంకట్ సురేష్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నట్టు సిఐ తెలిపారు
